Random Video

మన సచివాలయం దేశంలోనే చెత్త : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన | Oneindia Telugu

2017-11-01 748 Dailymotion

Telangana Chief Minister K Chandrasekhar Rao over New assembly and secretariate in Assembly.Congress MLAs unhappy with speaker Madhusudhana Chary for not giving mic to Congress Party leaders
దేశంలోనే ఇలాంటి చెత్త సచివాలయం లేదని, అందుకే కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో అన్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై విపక్షాల విమర్శలపై మండిపడ్డారు.ఈ అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్‌ జంగిల్‌ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. మన సచివాలయం బాగోలేదని, దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనది అన్నారు.
ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారే గందరగోళంగా ఉంటుందన్నారు. ప్రధాన విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయన్నారు.సచివాలయంలో ఒక్క భవనం కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని కేసీఆర్ తెలిపారు. నగరంలో క్రీడామైదానాలకు కొదవలేదని, 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయన్నారు. బైసన్‌పోల్‌ మైదానం క్రీడలకు ఉద్దేశించింది కాదని, మిలటరీ వాళ్లదన్నారు.